అన్నమయ్య: రాజంపేట మన్నూరు చెరువు వద్ద బుధవారం జరిగిన గంగ హారతి కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు పాల్గొన్నారు. నీటి సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. గత వైసీపీ ప్రభుత్వ వైఫల్యాల వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చితికిపోయిందని విమర్శించారు.