NTR: తిరువూరులోని శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఉదయం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు చేశారు. అనంతరం స్వామివారి కళ్యాణ వేడుకలు వైభవంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. దేవాలయ కమిటీ సభ్యులు భక్తులకు అన్నప్రసాదం వితరణ చేశారు.