SKLM: కోటబొమ్మాలి మండలం పట్టు పురం పంచాయతీలో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు శనివారం విస్తృతంగా పర్యటించారు. ఈ మేరకు పట్టు పురం బీటి రోడ్ నుంచి మణి నాగేశ్వరపురం వరకు రూ.1 కోటితో సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం పట్టుపురంలో రూ. 28 లక్షలతో రక్షిత మంచినీటి పథకం నిర్మాణం కొరకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కృష్ణమూర్తి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.