కర్నూలులో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 85 ఫిర్యాదులు స్వీకరించారు. ఉద్యోగాల పేరుతో మోసాలు, పెట్టుబడి మోసాలు, ఆస్తి వివాదాలు ప్రధానంగా వచ్చాయి. బాధితులతో మాట్లాడిన ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రతి ఫిర్యాదుపై చట్టపరంగా విచారణ చేసి త్వరితగతిన న్యాయం చేస్తామని సోమవారం తెలిపారు. అధికారులకు వెంటనే స్పందించాలని ఎస్పీ ఆదేశించారు.