ప్రకాశం: జరుగుమల్లి మండలం కే. బిట్రగుంట గ్రామ సమీపంలోని పాలేరు వాగులో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. వివరాలు తెలియకపోవడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు వెల్లడించారు.