ATP: పదో తరగతి విద్యార్థులకు రేపటి నుంచి గ్రాండ్ టెస్టులు మొదలవుతాయని డీఈవో ప్రసాద్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం తెలుగు, బుధవారం హిందీ, గురువారం ఇంగ్లీష్, శుక్రవారం లెక్కలు, శనివారం భౌతిక శాస్త్రం, సోమవారం జీవశాస్త్రం, మంగళవారం సోషల్, పరీక్షలు ఉంటాయన్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం 1.30గంటల నుంచి 4.45 వరకు ఈ పరీక్షలు జరుగుతాయన్నారు.