ATP: కళ్యాణదుర్గం నుంచి గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కురుబ ముక్కణ్ణ మంగళవారం BJPలో చేరారు. జిల్లా అధ్యక్షుడు కొనగొండ్ల రాజేష్ ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకున్నారు. బీజేపీ క్రమశిక్షణ, దేశాభివృద్ధి విధానాలకు ఆకర్షితులై ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. దేశ రక్షణ, రాష్ట్ర ప్రగతి కేవలం బీజేపీతోనే సాధ్యమని పేర్కొన్నారు.