NTR: జిల్లాలో బ్లాక్ స్పాట్స్ ప్రమాద పరిశీలన యాత్ర చేపట్టారు. కలెక్టర్ లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు అధికారులతో కలిసి 123 ప్రాంతాలను పరిశీలించారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి అందరి సహకారం అవసరమన్నారు. ఈ సంవత్సరంలో ప్రమాదాల రేటు తగ్గిందని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు ధరించాలని వారు విజ్ఞప్తి చేశారు.