PLD: నరసరావుపేట పురపాలక సంఘ పరిధిలో ఈనెల 17 నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ఆదివారం మున్సిపల్ కమిషనర్ జస్వంత్ రావు తెలియజేశారు. 18,19, 20 వరకు నిర్వహించే ఆధార క్యాంపులను పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రకాష్ నగర్ -2 సచివాలయం, రంగా స్ట్రీట్ సచివాలయం-2లో స్పెషల్ ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.