W.G: అంబేడ్కర్ జయంతి ర్యాలీ వీడియోలపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఇద్దరు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొగల్తూరు ఎస్సై జి.వాసు వివరాల ప్రకారం.. అంబేడ్కర్ జయంతి సందర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలపై నిందితులు అనుచితంగా స్పందించారు. దీనిపై సీతారామపురం సౌత్ గ్రామానికి చెందిన పిల్లి యశ్వంత్ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.