నెల్లూరు: బోగోలు మండలం కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో బుధవారం పౌర్ణమి సందర్భంగా విశేష పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆ రోజు రాత్రి ఎనిమిది గంటలకు గరుడ సేవ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు.