GNTR: తెనాలి మార్కెట్ యార్డులో మార్చి 29 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్న ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ఎడ్ల బలప్రదర్శన పోటీలకు గురువారం భూమి పూజ నిర్వహించారు. వేమూరు ఎమ్మెల్యే ఆనందబాబు కార్యక్రమంలో పాల్గొని ఏర్పాట్లను ప్రారంభించారు. పశుపోషకులను ప్రోత్సహించేందుకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.