తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నిన్న రాత్రి శ్రీరాముడు అశ్వవాహనంపై మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి అశ్వవాహనం అధిష్టించి భక్తులకు కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తున్నారు. తన నామ సంకీర్తనతో కలిదోషాలకు దూరంగా ఉండమని ప్రబోధిస్తున్నారు. భక్తులు కర్పూరహారతులు సమర్పించి దర్శించుకున్నారు.