విజయనగరం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది సయ్యద్ అబ్దుల్ కరీం నిన్న గుండెపోటుతో మరణించారు. కరీం కాంగ్రెస్ పార్టీలో ఉంటూ జిల్లా వర్ఫ్ బోర్డు మాజీ ఛైర్మన్గా 10 ఏళ్లు సేవలందించారు. దీంతో పాటు 35 ఏళ్లగా అనేక పదవులు చేపట్టి ప్రజలకు సేవలు అందించారు. ఈ మేరకు ఆయన మృతదేహానికి డీసీసీ జిల్లా అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ ఘన నివాళులు అర్పించారు.