అన్నమయ్య: రాయచోటిలోని పాతిమా మసీదులో YCP మైనారిటీ జిల్లా అధ్యక్షుడు బేపారి మహమ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ఇఫ్తార్ విందులో మాజీ MLA శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. రంజాన్ ఆధ్యాత్మికతతో పాటు క్రమశిక్షణ,సేవాభావం పెంపొందిస్తుందని కొనియాడారు. దైవచింతన వల్ల ఆత్మస్థైర్యం పెరుగుతుందని పేర్కొన్నారు.