W.G: ఆకివీడులోని టపాసుల విక్రయశాలలను భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల ఉండిలో గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు.. దుకాణాల్లో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించారు. నిబంధనల మేరకు జాగ్రత్తలు పాటించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.