KRNL: కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని జిల్లా ఎంపీ బస్తిపాటి నాగరాజు మంగళవారం కలిశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఢిల్లీలోని మంత్రి నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి, జిల్లాలో గనుల అభివృద్ధి, మౌలిక సదుపాయాలపై చర్చించారు. జిల్లాకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.