W.G: ఉండి MRO ఆఫీస్లో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు రెండు రోజుల పాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని జేసీ రాహుల్ బుధవారం పరిశీలించారు. గృహ, జనగణన డేటా సేకరణకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న వారికి పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. దేశ చరిత్రలో తొలిసారిగా గృహ జనగణన ప్రక్రియను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించబడుతుందని అన్నారు.