PLD: శ్రీరామనవమి పురస్కరించుకుని నాదెండ్ల మండలం ఎండుగుంపాలెంలో ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్లకు రంగం సిద్ధమైంది. రంగురంగుల విద్యుత్ దీపాలు, భారీ విద్యుత్ ప్రభలతో ఆలయ ప్రాంగణం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. రేపు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు జరగనున్నాయి. భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని ఆలయ కమిటీ అన్ని మౌలిక వసతులు కల్పించింది.