VZM: విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు శనివారం విజయనగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.