SKLM: అంబేడ్కర్ 135వ జయంతి సందర్భంగా, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కి కేంద్ర విమానయాన శాఖామంత్రి రామ్మోహన్ నాయుడు మంగళవారం ఘన నివాళులు అర్పించారు. సమర్థత గల నాయకునిగా, సామాజిక న్యాయ పోరాట యోధుడిగా, నిజమైన సంస్కర్తగా, మన దేశ భవిష్యత్తును మార్చిన మహానుభావుడు అంబేడ్కర్ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాణంలో ప్రధాన శక్తిగా అంబేడ్కర్ నిలిచారని కొనియాడారు.