TPT: రాపూరులోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలను వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ బుధవారం సందర్శించారు. విద్యార్థినులతో మాట్లాడి వారి చదువు, వసతి, ఆహారంపై వివరాలు తెలుసుకున్నారు. వంటశాలను పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించాలని అధికారులకు ఆదేశించారు. అలాగే హాస్టల్, తరగతి గదులు, తాగునీరు వంటి సదుపాయాలను పరిశీలించారు.
Tags :