కృష్ణా: గుడివాడ ఎన్టీఆర్ కాలనీలోని మోడల్ ప్రైమరీ స్కూల్లో ట్రాఫిక్ ఏఎస్ఐ వీ. భాగ్యవతి విద్యార్థులకు నోటు పుస్తకాలు,స్టేషనరీని మంగళవారం పంపిణీ చేశారు. విద్యార్థులందరూ బాగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హరికుమార్, సత్యనారాయణ, కనకమహాలక్ష్మి, అజయ్ కుమార్, మునీంద్ర, తాతారావు, స్కూల్ హెచ్ఎం రజిని పాల్గొన్నారు.