AKP: రాంబిల్లి(మం) పంచదార్లలో దళిత రైతులు చేపట్టిన నిరసన దీక్షలు 35వ రోజుకు చేరుకున్నాయి. ఆదివారం మోకాళ్లపై నిలబడి వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. జీడి, మామిడి తోటలను సాగు చేసుకుంటూ గత ఎన్నో ఏళ్ల నుంచి కుటుంబాలను పోషించుకుంటున్నామని తెలిపారు. ఇప్పుడు తమ భూములను స్వాధీనం చేసుకుంటే ఎలా బతకాలని వారు ప్రశ్నించారు.