అన్నమయ్య: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాయచోటిలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. డీఎస్పీ కృష్ణమోహన్ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. SN కాలనీ నుంచి నేతాజీ సర్కిల్ వరకు విద్యార్థినులతో మానవహారం నిర్వహించారు. మహిళల పట్ల అన్యాయం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. మహిళలకు ఎలాంటి సమస్యలు వచ్చినా పోలీసులు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు.