ASR: గంజాయి నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష, రూ.1లక్ష జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పినట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి గౌరీశ్వరరావు శుక్రవారం తెలిపారు. పాడేరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 2014లో 360 కిలోల గంజాయి తరలిస్తూ నిందితులు పట్టుబడ్డారన్నారు. ఇందులో ఏ-2 నిందితుడైన రాజమండ్రి ప్రాంతానికి చెందిన నాయుడు శ్రీనివాస్ అనే వ్యక్తికి శిక్ష పడిందన్నారు.