సత్యసాయి: కనగానపల్లిలోని రెడ్డివారికుంట చెరువు మరమ్మతు పనులను MLA పరిటాల సునీత ప్రారంభించారు. 2024లో కురిసిన భారీ వర్షాలకు ఈ చెరువు తెగిపోగా, ప్రభుత్వం DMF గ్రాంట్ నుంచి రూ. 86 లక్షల నిధులు మంజూరు చేసింది. స్థానిక కూటమి నాయకులతో కలిసి ఆమె భూమిపూజ చేశారు. రైతులకు ప్రయోజనం కలిగేలా పనులను నాణ్యతతో పూర్తి చేయాలని కాంట్రాక్టరును ఆదేశించారు.