PLD: జిల్లాలో ఎండలు రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా సూచించారు. కలెక్టరేట్ కార్యాలయంలో అర్జీదారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఎండల వల్ల అలసటకు గురయ్యే ప్రజలకు ఉపశమనం కలిగించేలా ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.