PPM: ఉత్తరాంధ్ర ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి ఆలయాన్ని చంద్ర గ్రహణం సందర్బంగా మూసివేస్తున్నట్లు ఈవో శ్రీనివాస్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఉదయం 6గంటలకు నిత్య పూజల్లో భాగంగా అమ్మవారికి భోగం నివేదించి, ఆలయం తలుపులు మూసి వేయడం జరుగుతుందన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. బుధవారం ఉదయం పోలమాంబ అమ్మవారి దర్శనం పునః ప్రారంభం జరుగుతుందన్నారు.