కృష్ణా: బాపులపాడు మండలం వేలేరు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో ధనియాల సాయి గణపతి సహకారంతో పదవ తరగతి విద్యార్థులకు ప్యాడ్లు,పెన్నులు తదితర పరీక్ష సామాగ్రిని బుధవారం పంపిణీ చేశారు. ఏపీడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు రాజశేఖర్ మాట్లాడుతూ.. విద్యార్థులు సెల్ ఫోన్, టీవీ, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని సూచించారు.