ATP: గుంతకల్లు మండలం పాత కొత్తచెరువు గ్రామంలో వాల్మీకి మహర్షి నూతన విగ్రహం ఏర్పాటు కొరకు మంగళవారం భక్తిశ్రద్ధలతో భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుంతకల్లు టీడీపీ మండల ఇంఛార్జ్ నారాయణస్వామి, శ్రీనివాసులు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. వాల్మీకుల్లో ఎంతో చైతన్యం వచ్చిందన్నారు.