కృష్ణా: మచిలీపట్నం కలెక్టరేట్లో జిల్లా నీటి యాజమాన్య సంస్థ రూపొందించిన వికసిత్ భారత్ జీరాంజీ ఉపాధి హామీ గోడ పత్రికలను కలెక్టర్ బాలాజీ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీరాంజీ పథకం 2026-2027 ఆర్థిక సంవత్సరం నుండి అమలులోకి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నవీన్, అధికారులు పాల్గొన్నారు.