అనంతపురం నేషనల్ పార్కును PPP విధానంలో అభివృద్ధి చేసి మూడు నెలల్లో సరికొత్త మార్పులు చూపిస్తామని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రకటించారు. శిల్పారామం నుంచి రూ. 2.62 కోట్లతో చేపట్టే సీసీ రోడ్డు పనులకు ఆయన భూమి పూజ చేశారు. గత ప్రభుత్వ హయాంలో పార్కు నిర్లక్ష్యానికి గురైందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం రూ.10 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టిందని తెలిపారు.