కోనసీమ: ఆత్రేయపురం మండలంలోని ర్యాలీ శ్రీ జగన్మోహిని కేశవస్వామి వారిని గురువారం రామచంద్రపురం సీనియర్ సివిల్ జడ్జి కె. వెంకటేశ్వరరావు దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామి వారికి ప్రత్యేక పూజలను నిర్వహించి వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు దర్శనం అనంతరం వారికి స్వామివారి ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.