BPT: ప్రభుత్వ బాధ్యతల్లో పారదర్శకత అత్యంత ముఖ్యమని తహసీల్దార్ ఎం.రవి నాయక్ అన్నారు. ప్రజలకు అందించే సేవలు స్పష్టంగా, అవినీతి రహితంగా ఉండాలని సూచించారు. ‘జనగణన’ ద్వారా జనాభా వివరాలు, సామాజిక-ఆర్థిక పరిస్థితులు తెలుసుకోవచ్చని, అభివృద్ధి ప్రణాళికలకు ఇది కీలకమని పేర్కొన్నారు. సిబ్బంది కచ్చితత్వంతో సమాచారం సేకరించి, ఎలాంటి పొరపాట్లు లేకుండా నమోదు చేయాలని సూచించారు.