TPT: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక పవిత్రోత్సవాల్లో చివరి రోజైన ఆదివారం అమ్మవారి ఆలయంలో చక్రస్నానం వైభవంగా జరిగింది. ముందుగా అమ్మవారి ఉత్సవమూర్తి, చక్రాతాళ్వార్, పరివార దేవతామూర్తుల ఉత్సవర్లకు వివిధ సుగంధ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం తిరుచ్చిపై ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకెళ్లి చక్రస్నానం నిర్వహించారు.