TPT: శనివారం పురస్కరించుకుని తిరుపతి జిల్లా నారాయణవనంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఊంజల్ సేవను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి ఆశీర్వాదాలు అందించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి సేవను కళ్లారా తిలకించి తరించారు. ఆలయ పరిసరాలు గోవింద నామస్మరణతో మారుమోగాయి.