అన్నమయ్య: తల్లిదండ్రులను వృద్ధులను నిర్లక్ష్యం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముని గోపాలకృష్ణ అన్నారు. ఆదివారం మదనపల్లె పట్టణంలో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొంతమంది వృద్ధులైన తల్లిదండ్రులను ఇళ్లలో నుంచి గెంటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.