ELR: మండవల్లి శివారు తరుగుమూల వద్ద ఉన్న ఇందిరమ్మ ఇళ్ల స్థలాల్లో పోలీస్ స్టేషన్ నిర్మాణం చేపట్టవద్దని పలువురు లబ్ధిదారులు డిమాండ్ చేశారు. రెవెన్యూ కార్యాలయం వద్ద ఇళ్ల స్థలాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్ష మంగళవారం రెండో రోజు కొనసాగింది. తరుగుమూల వద్ద స్థలాలను ప్రభుత్వమే మెరక చేయించి, ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టాలని వారు కోరారు.