CTR: పాడి రైతులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మురళీ మోహన్ సూచించారు. తవణంపల్లి మండలం దిగువ మోదాల పల్లిలో బంగారుపాలెం ఏఎంసీ ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం శుక్రవారం నిర్వహించారు. శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. పశువుల ఆరోగ్యం పట్ల రైతులకు అవగాహన కల్పించడమే శిబిరం ఉద్దేశం అన్నారు.