సత్యసాయి: అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. మడకశిర నియోజకవర్గ అభివృద్ధి పనుల పురోగతి గురించి ముఖ్యమంత్రికి వారు వివరించారు. నియోజకవర్గంలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి, తాగునీటి సమస్య పరిష్కరించాలని ఈ సందర్భంగా విన్నవించారు.