ASR: జిల్లాలో భూగర్భ జల మట్టాలను పెంచడం, చెరువులు, జలాశయాలను పునరుద్ధరించడం లక్ష్యంగా “జలధార-జలహారతి” కార్యక్రమాన్ని చేపట్టాలని కలెక్టర్ నిషాంతి సోమవారం అధికారులను ఆదేశించారు.100 రోజుల ప్రత్యేక యాక్షన్ ప్లాన్తో, ఉపాధి హామీ నిధుల అనుసంధానంతో సాగునీటి వ్యవస్థలను బలోపేతం చేయాలన్నారు. నీటి వనరులకు సాంకేతికత అనుసంధానించి నీటి వనరులు పునరుద్ధరించాలన్నారు.