NDL: ఆత్మార్పణ దినోత్సవం పురస్కరించుకుని బనగానపల్లెలోని శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఆదివారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం నిస్వార్ధంగా తన ప్రాణాలను అర్పించిన మహానీయుడు పొట్టి శ్రీరాములు సేవలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా మంత్రి బీసీ కొనియాడారు. కూటమి నేతలు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.