తూ.గో: నల్లజర్ల మండలంలో లక్షలాది రూపాయలతో నిర్మించిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు నిరుపయోగంగా మారాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో ఇవి పనిచేయడం లేదని వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి కేంద్రాలను వెంటనే వినియోగంలోకి తెచ్చి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని గ్రామస్థులు కోరుతున్నారు.