ప్రకాశం: మార్కాపురంలో డిగ్రీ కళాశాల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థులు ఆందోళన చేశారు. శుక్రవారం మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏవోను కలిసి తమ సమస్యలను వివరించారు. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో యాజమాన్యాలు తమపై ఒత్తిడి చేస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.