E.G: పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి వీఎల్. కాంతారావు బుధవారం రాజమండ్రికి విచ్చేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమె పూల మొక్కను అందజేసి ఆత్మీయ స్వాగతం పలికారు. కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.