AKP: ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో 23వ వార్డు అభివృద్ధికి ఈ నెలలో రూ. 50 లక్షలు మంజూరు చేస్తానని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. ఇవాళ విజయవాడ మంత్రి నివాసంలో 23వ వార్డు కౌన్సిలర్ ఎం రామకృష్ణ మంత్రిని కలిశారు. గతంలో వార్డు అభివృద్ధి కోసం కౌన్సిలర్ ఆమరణ దీక్ష చేసిన సందర్భంగా మంత్రి రూ.కోటి నిధులు ఇస్తానని హామీ ఇచ్చారు.