KRNL: టీడీపీ మహానాడు ప్రజా సమస్యల పరిష్కార వేదికగా కాకుండా రాజకీయ ప్రచార సభగా మారిందని ఇవాళ డీసీసీ అధ్యక్షులు క్రాంతి నాయుడు విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై మహానాడులో చర్చ జరగకపోవడం బాధాకరమన్నారు.