KDP: సింహాద్రిపురంలో శనివారం రాత్రి మూడు లారీల బ్యాటరీలను దొంగలు ఎత్తుకెళ్లారు. స్థానిక హెచ్.పీ గ్యాస్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న మైదానంలో మూడు టిప్పర్ లారీలను పార్కింగ్ చేయగా.. గుర్తు తెలియని వ్యక్తులు టిప్పర్ల నుంచి మూడు డబుల్ లారీలను దొంగతనం చేశారు. వీటి విలువ రూ.90వేలు ఉంటుందని బాధితుడు సుధీర్ కుమార్ రెడ్డి సోమవారం తెలిపారు.