GNTR: గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని బీఆర్ స్టేడియం అభివృద్ధి పనులకు గురువారం కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేశారు. బీఆర్ స్టేడియం కేవలం మైదానం మాత్రమే కాకుండా క్రీడాకారుల కలలకు రెక్కలు ఇచ్చే దేవాలయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మహమ్మద్ నసీర్, గల్లా మాధవి పాల్గొన్నారు.